Thursday, April 25, 2024

ఈ ఉగాది ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాలి : రేవంత్ రెడ్డి

ఈ ఉగాది తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. గాంధీభవన్ లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు చిలుకూరు శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో ఉగాది వేడుకలకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ, వర్కింగ్ ప్రెసిడెండ్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ లతో పాలు పలువురు ఏఐసీసీ నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈసంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఉగాది ప్రజల కష్టాలను దూరం చేయాలన్నారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏ లక్ష్య సాధనలో భాగంగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారో.. ఆదిశగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదులో 40 లక్షలు పూర్తి చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ ముగ్గురు మహిళల సారథ్యంలో ఏర్పడిందని..ఇప్పుడు తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement