Thursday, March 28, 2024

గోదావరిలో ఈతకు వెళ్లి.. ఇద్దరు ఉపాధ్యాయుల గల్లంతు

చెన్నూర్: గోదావరి నదిలో ఈతకు వెళ్లిన ఇద్దరు ఉపాధ్యాయులు గల్లంతైన ఘటన మంచిర్యాల జిల్లాలో ఇవ్వాల (ఆదివారం) జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అస్సిస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ కు చెందిన ఇద్దరు ఉపాద్యాయులు ఫాదర్ టోనీ, ఫాదర్ బిజూ కోటపల్లి మండలం ఎర్రయ్యపేట వద్ద గోదావరిలో ఈతకు వెళ్లి కనిపించకుండా పోయారు. ఆదివారం సెలవు కావడంతో వారు సరదాగా ఈతకు వెళ్లినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కోటపల్లి పోలీసులు, అగ్నిమాప కసిబ్బందితో కలిసి గల్లంతైన వారికోసం గాలిపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement