Tuesday, March 26, 2024

మహిళపై అత్యాచారం చేసిన ఇద్దరికి రిమాండ్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌, (ప్రభన్యూస్‌) : అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌ గ్రామంలో 22న సోమవారం సాయంత్రం ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు హత్యచేసిన విషయం తెలిసిందే. మృతురాలి కుమారుడు ఇరగదిండ్ల మల్లేష్‌ ఫిర్యాదు మేరకు 23 మంగళవారం మృతురాలు ఆండాలు భర్త ఈదయ్య అలియాస్‌ మల్లేశంతో పాటు ఇద్దరి నిందితుల్లో ఒకరైన సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరొక నిందితుడు శ్రీకాంత్‌ పరారీలో ఉన్నాడు.

బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వనస్థలిపురం ఏసిపి పురుషోత్తంరెడ్డి నిందితులు అంగీకరించిన వివరాలను వెల్లడించాడు. పరారీలో ఉన్న శ్రీకాంత్‌ను ఇన్‌స్పెక్టర్‌ స్వామి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారని తెలుపుతూ.. మహిళపై అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరిచి హత్యచేసి, మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు అంగీకరించారని తెలిపాడు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement