Tuesday, March 26, 2024

నిన్న బీజేపీ.. నేడు టీఆర్ఎస్.. 24 గంటల్లో కౌన్సిలర్ల యూటర్న్

బీజేపీలో చేరిన టీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు.. తిరిగి సొంత‌గూటికి చేరుకున్నారు. నిన్న దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ఇద్ద‌రు కౌన్సిల‌ర్లు.. దివిటి క‌న‌క‌య్య‌, డీ బాల‌కృష్ణ‌నిన్న బీజేపీలో చేరారు. వీరిద్ద‌రూ మ‌ళ్లీ ఇవాళ తిరిగి మంత్రి హ‌రీష్ రావు, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా క‌న‌క‌య్య‌, బాల‌కృష్ణ మంత్రి హ‌రీష్ రావు గులాబీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. అభివృద్ధికి పాటుప‌డుతున్న టీఆర్ఎస్ పార్టీలోనే తాము ఉంటామ‌ని కౌన్సిల‌ర్లు స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement