Wednesday, April 24, 2024

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య.. ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు

నిజామాబాద్ రూరల్ (ప్ర‌భ న్యూస్‌) : నిజామాబాద్ జిల్ఆ మోపాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు గ్రామాల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డరు. భార్యతో గొడవ పడి ఒకరు.. అనారోగ్య సమస్యతో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారని మోపాల ఎస్ ఐ మహేష్ తెలిపారు. న్యాల్కల్ గ్రామానికి చెందిన కాసుల లక్ష్మణ్ (78) ఆరోగ్య సమస్యలు, తన కొడుకు కోడలు రెండు సంవత్సరాల నుండి దూరంగా ఉండటంతో కలత చెందాడు. తన అన్న కొడుకు మహారాష్ట్ర లో చనిపోయిన విషయంలో మాట్లాడించి వచ్చే సమయంలో ఈ నెల 3న గ్రామ చెరువులో పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు ఎస్ ఐ వివరించారు.

అలాగే బైరాపుర్ గ్రామానికి చెందిన జెత్య నాయక్ తండాలో కేతావత్ సవాయి (43) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడు సంవత్సరాలుగా భార్యతో గొడవలు పడి ఆమే విడిపోయింది. దీంతోపాటు అప్పుడప్పుడు వచ్చి గొడవలు చేసి పోవడం వలన మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ ఐ వివరించారు. ఈ రెండు ఘ‌ట‌న‌ల విష‌యంలో కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న‌ట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement