Friday, March 29, 2024

ఇక‌పై ఆన్ లైన్ లోనే టీఎస్‌పీఎస్‌సీ ప‌రీక్ష‌లు… కొత్త షెడ్యూల్ విడుద‌ల‌

హైదరాబాద్‌, ఆంధ్ర ప్రభ : ఇటీవల రద్దు చేసిన అసి స్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈ ఈ) ఉద్యోగ నియామక పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. మే 8, 9, 21 తేదీల్లో పరీక్షలను నిర్వ హించనున్నట్లు తెలిపింది. మే 8న ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఏఈఈ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తామని, మే 9న అగ్రికల్చర్‌, మెకానికల్‌ ఏఈఈ ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మే 21న సివిల్‌ ఏఈఈ పరీక్షను ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్షను నిర్వహించనుంది. ప్రతి రోజూ రెండు సెషన్‌లలో పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను పరీక్ష తేదీలకు ఒక వారం ముందు నుంచి వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. పేపర్‌ లీక్‌ కారణంగా జనవరి 21న జరిగిన ఏఈఈ పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు రద్దు అయిన మిగతా పరీక్షల తేదీలను కూడా ఒకట్రెండు రోజుల్లో టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement