Thursday, April 25, 2024

టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కంప్యూట‌ర్ హ్యాక్… ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా

హైద‌రాబాద్ : టీఎస్‌పీఎస్సీ కార్యాలయం లోని ప‌రీక్ష‌ల సంబంధిత కంప్యూట‌ర్ హ్యాక్ కావడంతో రేపు జ‌ర‌గాల్సిన టీపీబీవో పోస్టుల‌కు నిర్వ‌హించాల్సిన రాత‌ప‌రీక్ష‌ను, ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ రాత‌ప‌రీక్ష‌ను వాయిదా వేస్తున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది.. హ్యాకింగ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌ని పేర్కొంది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టార‌ని స్ప‌ష్టం చేసింది. వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ల తేదీల‌ను మ‌ళ్లీ ప్ర‌క‌టిస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement