Thursday, April 18, 2024

TS Politics: మీ ప్రేమ, ఆప్యాయత మరువను.. వైఎస్సార్ బిడ్డగా మాటిస్తున్నా: ష‌ర్మిల‌

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో నిన్న పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతూ వారి క‌ష్టాలు తెలుసుకున్నారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన రెస్పాన్స్‌పై ఆమె స్పందిస్తూ ఈ రోజు ట్వీట్ చేశారు.

‘ప్రజా ప్రస్థానంలో మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, ఆదరణ ఎన్నటికీ మరువలేనిది. మీ కన్నీళ్లను, కష్టాలను చూస్తుంటే మీకోసం పోరాడాలన్న తపన రెట్టింపవుతోంది. వైఎస్సార్ బిడ్డగా మాటిస్తున్నాను.. ప్రజల తరుఫున కడదాకా పోరాడతాను. ప్రజల కష్టాలు తీర్చేందుకు నిరంతరం ఉద్యమిస్తా’ అని ష‌ర్మిల ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ రోజు ఆమె రెండో రోజు పాద‌యాత్ర ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement