Thursday, April 25, 2024

టిఎస్ ఎంసెట్ ప‌రీక్ష తేదిల‌లో మార్పులు ..

హైద‌రాబాద్ : టీఎస్ ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జ‌ర‌గాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు చేసిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఆ పరీక్ష‌ల‌ను మే 12, 13, 14 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. కాగా,మే 10, 11 తేదీల్లో నిర్వ‌హించాల్సిన ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష య‌థాత‌థంగా జ‌ర‌గ‌నుంది. జాతీయ స్థాయిలో మెడిక‌ల్ ఎంట్రెన్స్ ప‌రీక్ష నీట్ , టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ‌ ప‌రీక్ష‌ల కార‌ణంగా ఎంసెట్ ఇంజినీరింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement