Thursday, April 25, 2024

TS: ఈనెల‌ 25న బీజేపీ మహా ధర్నా

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మరో ఆందోళనకు సిద్ధమైంది. ‘‘మా నౌకరీలు మాగ్గావాలె’’ నినాదంతో ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’ చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే నిరుద్యోగ యువతతో కలిసి ఈ నిరుద్యోగ మహా ధర్నా నిర్వహించనుంది. ఈరోజు మధ్యాహ్నాం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్ వంటి అంశాలపై చర్చించారు. ఈసంద‌ర్భంగా మ‌హాధ‌ర్నా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement