Friday, March 29, 2024

TS: హుజూరాబాద్ లో trsను అడ్డుకోకుంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు..

వ్యక్తి స్వేచ్ఛను, ఓటు హక్కును శాసించే స్థాయికి టీఆర్ ఎస్ నేత‌లు చేరుకున్నారని హుజురాబాద్ బీజీపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ప్రలోభాల‌ ప్రవాహాలు, లిక్కర్ బాటిల్స్, నోట్ల కట్టలు, కుట్రలు కుతంత్రాల పర్వం హుజురాబాద్ లో కొనసాగుతుంది. 5 నెలల 26 రోజులుగా ఇదే కొనసాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, హనరోరియంతో పనిచేసే వారికి టీఆర్ ఎస్‌ వారు హుకుం జారీ చేశారు.

TRS కి ఓటు వేయకపోతే ఉద్యోగం తీసివెస్తాం అని బెదిరిస్తున్నారు. పర్మినెంట్ గా ఉన్న ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.
ఇన్ని ప్రతిబంధకాల మధ్య హుజూరాబాద్ ప్రజలు నలిగిపోతున్నారు. 30న మా ఆత్మను ఆవిష్కరించి మా గుండెల్లో ఉన్న మీకు ఓటు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు. పత్రికా యాజమాన్యాలు, టీవీ ఛానళ్ల ఓనర్లు, ప్రజాస్వామ్య వాదులారా  హుజూరాబాద్ వైపు చూడండి. ఇక్కడ జరిగేది మామూలు విషయం కాదు.

ఇప్పటికే 5 వందల కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా ఎంత అయినా ఖర్చు పెడతాం ఈటల రాజేందర్ ను ఓడించాలని చూస్తున్నారు. ఊరుకు ఊర్లు బార్లు గా మార్చారు. ఇప్పుడు ఓటుకు 20 వేల రూపాయలు పంచుతారట. వీటన్నిటి నిలవరించకపోతే రాబోయేకాలంలో  ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అవుతుంది. పౌరుల స్వేచ్ఛకు, ప్రాథమిక హక్కులను భంగం కలుగుతుంది కాబట్టి  ఆలోచన చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement