Thursday, April 25, 2024

ఎన్నిక ఏదైనా గెలుపు TRS పార్టీదే: మంత్రి సత్యవతి

తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి టి.ఆర్.ఎస్ అని మరోసారి రుజువైందని అన్నారు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు sతెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ పార్టీదే అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్థానిక సంస్థలకు జరిగిన 12 స్థానాలకు 6 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, నేడు ఎన్నిక జరిగిన మరో ఆరుగురు అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు అభ్యర్థులు భానుప్రసాదరావు, ఎల్. రమణ, దండే విఠల్, యాదవరెడ్డి, ఎం.సి. కోటిరెడ్డి, తాతా మధులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారి గారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఓట్లు వేసి టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి, సీఎం కేసీఆర్ కి మద్దతు పలికిన స్థానిక సంస్థల సభ్యులకు మంత్రి సత్యవతి కృతఙ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement