Friday, April 26, 2024

ఖాళీ బిందెతో టీఆర్ఎస్ కార్పొరేటర్ నిరసన

నీటి సమస్యపై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్ నిరసనకు దిగింది. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశం శనివారం నగర మేయర్ సునీల్ రావు ఆడిక్షతన ప్రారంభం కాగానే అధికార టిఆర్ఎస్ కార్పొరేటర్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టవర్ ప్రాంతానికి చెందిన కౌర్ కాలి బిందెతో  నిరసనకు దిగింది. తాను మాజీ మేయర్ రవీందర్ సింగ్ బంధువు కావడం వల్లనే నీటి సమస్య పరిష్కరిచడం లేదని ఆమె ఆందోళన చేసింది. ఈ క్రమంలో కొందరు టిఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డు తగలడంతో కొద్దిసేపు సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement