Wednesday, March 27, 2024

రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలని టీఆర్ఎస్ ఎంపీల నిర‌స‌న

పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండవరోజు మంగళవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ… ధర్నా నిర్వహించారు. లోక్ సభలో టీఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల లోక్ సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ నేత, పసునూరి దయాకర్ తదితరులు ప్లకార్డులు పట్టుకొని తమ స్థానాల్లో బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందు చూపు వల్ల రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు వంటి పథకాలతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందటం వల్ల దిగుబడులు పెరిగాయన్నారు. ఆ మేరకు ఎఫ్ సి ఐ కొనుగోళ్లను పెంచాల్సి ఉందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాదు, రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను చేపట్టాలన్నారు. దేశానికి ఆదర్శవంతమైన రైతుకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం విధి, విధానాలను రూపొందించి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతుల కోసం తమ ఆందోళన, ఉద్యమం కొనసాగుతుందని వారు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement