Thursday, March 28, 2024

న‌వోదయ విద్యాల‌యాలు కేటాయించాలి: టీఆర్ఎస్ ఎంపీలు

తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న  చేప‌ట్టారు. తెలంగాణ‌లోని అన్ని జిల్లాల్ల‌కు న‌వోదయ విద్యాల‌యాలు కేటాయించాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని కేంద్రాన్ని కోరారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పార్లమెంట్ లో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వ‌ర్ రావుతోపాటు ఎంపీలు కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, నేత‌కాని వెంక‌టేశ్, రాములు, ప‌సునూరి ద‌యాక‌ర్, మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement