Tuesday, April 16, 2024

యాదాద్రి ఆధ్యాత్మిక కేంద్రం: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు వేద మంత్రోచ్ఛారణతో స్వామి వారి ఆశీస్సులను అందజేశారు. యాదాద్రి ఆలయం ప్రపంచ చరిత్రలో నిలచిపోనుందని ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి అన్నారు. ఆలయం నిర్మాణం అద్భుతంగా ఉందని కితాబ్ ఇచ్చారు. ఆధ్యాత్మికతను పెంపొందించుకునే విధంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని కౌశిక్ రెడ్డి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement