Wednesday, April 24, 2024

పీయూష్ గోయ‌ల్ తో భేటీ కానున్న టీఆర్ఎస్ నేత‌లు

సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేత‌లు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై ఈరోజు సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో మూడో రోజు పర్యటిస్తున్నారు. ఇటీవ‌లే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని ప్రకటించడంతో మంత్రులు, అధికారుల బృందంతో సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ‌ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో టీఆర్‌ఎస్‌ నేతలు భేటీ కానున్నారు.

అయితే కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి ఎంపీ నామా నాగేశ్వర్‌రావులు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఈ భేటీలో తెలంగాణ‌ నుంచి ప్రతి సంవత్సరం ఎంత ధాన్యాన్ని ఏ రూపంలో కొనుగోలు చేస్తారో.. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నేతల బృందం కేంద్రాన్ని కోరనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement