Thursday, April 18, 2024

టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి సామ వెంకట్‌రెడ్డి.. మరికొంత మంది నేతలు..

తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సామ వెంకట్‌రెడ్డి సహా మండలి కార్యవర్గ సభ్యులందరూ టీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చారు.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన త్వరలోనే కాంగ్రెస్ చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు సహా మండలి కార్యవర్గ సభ్యులందరూ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.. వీరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వెంకట్‌రెడ్డి నిన్న ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడారు.

నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా తాను పనిచేసినట్టు చెప్పారు. తమ సంఘానికి 33 జిల్లాల్లో కమిటీలు ఉన్నాయని, దాదాపు 40 వేల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఉద్యమకారులు నిరాశలో కూరుకుపోతున్నారని అన్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వెంకట్‌రెడ్డి సహా కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్‌ను కలిశారని, ముఖ్యనాయకులతో చర్చించిన అనంతరం వారిని పార్టీలో చేర్చుకోనున్నట్టు చెప్పారు.

ఇది కూడా చదవండి : కౌశిక్ రెడ్డికి భారీ జరిమానా..

Advertisement

తాజా వార్తలు

Advertisement