Saturday, April 20, 2024

అదిరిపోయేలా గ‌ర్జ‌న నిర్వ‌హిస్తామ‌న్న మంత్రి ఎర్ర‌బెల్లి

ప్ర‌భ‌న్యూస్ బ్యూరో, వ‌రంగ‌ల్: టీఆర్ఎస్ ద్వి దశాబ్ది ఉత్స‌వాల సందర్భంగా నవంబర్ 15న వరంగల్ లో తెలంగాణ విజయ గర్జన సభ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భ కోసం ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపనేని నరేందర్ తో కలిసి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు శ‌నివారం స్థ‌ల ప‌రిశీల‌న చేశారు.

వరంగల్ మామునూరులోని స్థలాన్ని మంత్రి పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్, హాజరయ్యే కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు సరిపోయే విధంగా ఉంటుందా? అనే విషయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇతరత్రా ఇంకా ఏమైనా స్థలాలున్నాయా? అనే విషయాన్ని కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు చెప్పారు. అన్ని హంగులతో సభ విజయవంతం కావడానికి అవసరమైన స్థలం అవసరమన్నారు. ఈ సభలో సీఎం, పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ మాట్లాడతారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలు, ప్రభుత్వం సాధించిన ప్రగతిని సీఎం కేసీఆర్ నివేదిస్తారని ఎర్ర‌బెల్లి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement