Thursday, March 28, 2024

సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌పై నిర్మ‌ల్ లో సంబురాలు

తెలంగాణలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భ‌ర్తీ చేస్తామ‌ని సీఎం కేసీఆర్ శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించడంతో నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో సంబురాలు చేసుకుంటున్నారు. మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, ఎఫ్ఎసీఎస్ చైర్మ‌న్ ధ‌ర్మాజీ రాజేంద‌ర్, నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ టీఆర్ఎస్ నాయ‌కులు మారుగొండ రాము, టీఆర్ఎస్ శ్రేణ‌లు, నిరుద్యోగులు బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి, సంబురాలు నిర్వ‌హించారు. ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement