Friday, April 19, 2024

అమ‌ర‌వీరుల‌ స్థూపంకు నివాళులు.. కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

గ‌న్ పార్కులో అమరవీరుల స్థూపంకు నివాళులర్పించి, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమించాలని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించిన రోజు డిసెంబర్ 9 అని దానికి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందని.. అందుకే ఆరోజును గుర్తు చేసుకుంటూ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తూ , సీఎం కేసీఆర్ చిత్ర పటాని

కి విద్యార్థి ఉద్యమ నాయకులతో కలిసి జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29 సంవత్సరంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఉద్యమ నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగిందని, దాని ఫలితంగానే డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం చెప్ప‌డంతో తెలంగాణ ప్రకటనను సాధించడం జరిగిందని అన్నారు. కానీ వచ్చిన తెలంగాణను ఆపడానికి అప్పటి ఆంధ్ర పాలకులు ఎన్నో కుట్రలు చేశార‌ని, అయిన‌ప్ప‌టికీ యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంటే సహకరించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కులకు అడ్డుపడుతూ.. సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని, లేని పక్షంలో ఆరోజు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించామో.. అదే ఉద్యమ స్ఫూర్తితో ప్ర‌స్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి సీఎం కేసీఆర్ నాయకత్వంలో త‌మ న్యాయమైన హక్కులు సాదించుకుంటామ‌ని అన్నారు.


మొన్న బీజేపీ లో చేరిన తీన్మార్ మల్లన్న అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడని.. అసలు ఉద్యమంలో మల్లన్న పాత్ర ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పై కానీ, కేటీఆర్ పైన కానీ, వారి కుటుంబ సభ్యులపై కానీ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని ఉద్యమకారులు నిన్ను తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9వ‌తేదీన‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.

- Advertisement -

ఇప్పటికే దాదాపు 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఉచిత విద్యనందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంద‌ని అన్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని త‌మలాంటి విద్యార్థి నాయకులకు ఉన్నతమైన పదవులు కట్టబెట్టడం కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ అల్లిపూర్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు వినీత్ కుమార్, మేకల రవి, శ్రీకాంత్, అనిల్, ప్రణీత్, కృష్ణ, నవీన్, ఇలియాస్, జహీర్, పాండు, మధుకర్, సతీష్, సన్నీ, ముఖేష్, అబ్బు, లడ్డు, జంగయ్య, అవినాష్, అఖిల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహ ముదిరాజ్, గోషామహల్ మహేందర్, పరమేశ్వరి సింగ్, పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉద్యమ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement