Saturday, April 20, 2024

అట‌వీ అధికారులపై గిరిజ‌నుల దాడి… ఎక్క‌డంటే…

అట‌వీశాఖ అధికారుల‌పై గిరిజ‌నులు దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని లింగంపేట్ మండ‌లం ముంబోజిపేట్ తండాలో ఈఘ‌ట‌న జరిగింది. గిరిజ‌నులు ట్రాక్ట‌ర్ల‌తో పొలం చ‌దును చేస్తుండ‌గా… రైతుల‌ను అట‌వీశాఖ అధికారులు అడ్డుకున్నారు. అక్ర‌మంగా అట‌వీ భూముల‌ను దున్నుతున్నార‌ని అధికారులు పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలో అధికారుల‌పై గిరిజ‌నులు క‌ర్ర‌ల‌తో దాడుల‌కు పాల్ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ఫారెస్ట్ అధికారుల‌ను గిరిజ‌నుల దాడుల నుంచి కాపాడారు. గాయ‌ప‌డ్డ అధికారుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement