Tuesday, April 23, 2024

మల్టీ జోన్ వన్ పరిధిలో ఇన్ స్పెక్టర్ల బదిలీ

మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐ జి పి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం సి ఎస్ బి లో ఉన్న వెంకటేశ్వర్లును ఖమ్మం జిల్లా కారేపల్లికి, బైంసా టౌన్ లో పనిచేస్తున్న ప్రవీణ్ ను కోరుట్లకు, కోరుట్లలో పనిచేస్తున్న రాజశేఖర్ రాజును జగిత్యాల డి.ఎస్.బి కి, జగిత్యాల ఎస్ బి లో ఉన్న శ్రీనివాసును ఐజి ఆఫీసుకు, కారేపల్లిలో పనిచేస్తున్న ఆరిఫ్ అలీఖాన్ ను జగిత్యాల రూరల్ కు, రూరల్ లో ఉన్న కృష్ణకుమార్ ను ఐజి ఆఫీసుకు, బెజ్జూర్ లో చేస్తున్న బుద్దే స్వామిని కాగజ్ నగర్ టౌన్ కు, కాగజ్ నగర్ లో పనిచేస్తున్న రవీందర్ ను ఐజి ఆఫీసుకు, మంచిర్యాల టౌన్ లో పనిచేస్తున్న నారాయణను ఖానాపూర్ కు, ఐ జి పి ఆఫీస్ లో పనిచేస్తున్న ఎల్ శ్రీను ను బైంసా ఎస్ హెచ్ ఓ గా, రామగుండం టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న కృష్ణారెడ్డి లక్షట్టి పేట్ కు, ఖానాపూర్ లో పనిచేస్తున్న అజయ్ బాబును ఐజి ఆఫీస్ కు, లక్షెట్టిపేటలో పనిచేస్తున్న కరీముల్లాను ఐజి ఆఫీసుకు, బెల్లంపల్లి టౌన్ లో పనిచేస్తున్న రాజును మంచిర్యాల టౌన్ కు, సి ఎస్ బి ఖమ్మంలో పనిచేస్తున్న సత్యనారాయణ రెడ్డిని చేర్యాలకు, ఎస్ బీ నిర్మల్ లో పనిచేస్తున్న పర్శ రమేష్ ను తిమ్మాపూర్ కు, పూర్ లో పనిచేస్తున్న శశిధర్ రెడ్డిని ఐజి కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement