Friday, April 19, 2024

Tragedy – ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం – రైతుపై నుంచి దూసుకెళ్లిన ట్రాక్ట‌ర్

క‌రీంన‌గ‌ర్ – ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన అన్నదాత దుర్మరణం చెందాడు. ధాన్యానికి కాపలా పడుకున్న అతనిపై నుంచి ట్రాక్టర్‌ వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం పచ్చనూర్‌లో చోటుచేసుకుంది. సర్పంచ్ ఉమారాణి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ఉప్పులేటి మొండయ్య (60) ఐకెపి వద్దకు రెండు రోజుల క్రితం తన ధాన్యాన్ని తీసుకొని వచ్చాడు. శనివారం వేకువ జామున 3’గంటలకు వడ్లను తూకం వేశారు. ఉదయం లోడింగ్ చేస్తాననడంతో మొండయ్య ఐకేపీ వద్ద తాడిపత్రి కప్పుకుని నిద్రపోయాడు. ఈ క్రమంలో ఐకెపి నుంచి వడ్ల లోడుతో రైస్ మిల్ కు వెళ్లేందుకు ట్రాక్టర్ డ్రైవర్ వాహనం తీస్తుండగా మొండయ్యను గమనించకుండా అతని మీద నుంచి ఎక్కించాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్ఎండీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ ఎం డి ఎస్ ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement