Friday, March 29, 2024

ట్రాక్టర్ బోల్తా.. పట్టుబడ్డ బెల్లం, టేకు కలప

భూపాలపల్లి (ప్రభన్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎలి కేశ్వరం గ్రామ సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మహాదేవపూర్ వైపు వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న టేకు కలప, నల్ల బెల్లం బయటపడింది. సంఘటనా స్థలానికి మహదేవపూర్ పోలీసులు, అటవీ శాఖ అధికారులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement