Thursday, April 25, 2024

వెంకట్ ను పరామర్శించిన రేవంత్.. పోలీసులపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

పెగాసస్ వ్యవహారంపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో గాయపడిన ఎన్ఎస్ యూఐ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. వెంకట్ కు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను రేవంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై రేవంత్ మండిపడ్డారు. పోలీసుల దుందుడుకు వైఖరి కారణంగానే వెంకట్ కు గాయాలు అయ్యాయని అన్నారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో వెంకట్ చురుగ్గా పాల్గొంటున్నందుకే అతనిని టార్గెట్ చేశారని తెలిపారు. వెంకట్ పక్కటెముకలను లక్ష్యంగా చేసుకుని కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీకి, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. వెంకట్ త్వరగా కోలుకుని, మళ్లీ చురుగ్గా కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement