Thursday, April 25, 2024

శివాజీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదు: ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బోధన్ ఘటనపై ఎంపీ అరవింద్ స్పందించారు. బోధ‌న్ పట్టణంలో ఛ‌త్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి గతంలోనే మున్పిపల్ అధికారులకు అప్లికేషన్ పెట్టామని, కానీ అక్కడ గులాబీ నాయకులు టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ మెలిక పెడుతున్నార‌ని మండిపడ్డారు. అయితే.. ఛ‌త్రపతి శివాజీ భారత దేశ హీరో అని.. కానీ టిప్పు సుల్తాన్ హిందువులపై హత్యలు, అత్యాచారాలు చేసిన నీచుడని పేర్కొన్నారు. అల్లరి మూకలను చెదరగొట్టాల్సింది పోయి ఛ‌త్రపతి విగ్రహాన్ని తీసేయాలని హిందూ సంఘాలు చెప్పడం ఏంటని మండిపడ్డారు. అయితే విగ్రహం అక్కడి నుండి తీసే ప్రసక్తే లేదని, లా ఆండ్ ఆర్డ‌ర్‌ను కంట్రోల్ చేయాల్సిన బాధ్య‌త పోలీసులదేనని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement