Wednesday, April 24, 2024

Breaking: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

వరంగల్ జిల్లా బొల్లికుంటలో ఇవ్వాల (ఆదివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వర్ధన్నపేటకు చెందిన కూరగాయల వ్యాపారులుగా సమాచారం. ప్ర‌మాదానికి సంబంధించి మిగతా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement