Thursday, April 25, 2024

నిజామాబాద్‌లో దొంగల బీభత్సం.. పెట్రోల్ బంక్‌పై రాళ్లతో దాడి

నిజమాబాద్‌ జిల్లాలో అర్థరాత్రి దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలోని గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో దొంగల బీభత్సం సృష్టించారు. 10 మందికి పైగా ముఠాగా వచ్చి పెట్రోల్ బంక్‌పై రాళ్లతో దాడి చేశారు. సిబ్బందిని బెదిరించి పెట్రోల్‌ బంక్‌లోని క్యాష్‌కౌంటర్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. అందులో సుమారు రూ. 40 వేలు ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెట్రోల్‌ బంక్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement