Thursday, April 18, 2024

Breaking | మెట్‌ప‌ల్లిలో దొంగల బీభత్సం.. హైవేపై ఉన్న 7 దుకాణాల్లో ఒకేసారి చోరీ

జగిత్యాల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం తెల్లవారుజామున మెట్ పల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న ఏడు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. దుకాణాల తలుపులు పగలకొట్టి సొమ్ము అపహరించుకుపోయారు. వరుసగా ఉన్న ఎలక్ట్రికల్, కిరాణ, ఫర్టిలైజర్స్, మెడికల్, ఆగ్రో సేవ దుకాణాల్లో చోరీ జరగడం పట్టణంలో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న మెట్‌ప‌ల్లి సీఐ లక్ష్మీనారాయణ ఘటపా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement