Tuesday, April 23, 2024

Crime: తాళం వేసిన ఇంట్లో చోరీ

వికారాబాద్ జిల్లా తాండూరులో దొంగ‌లు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసి ఇండ్ల‌ను టార్గెట్ చేసుకుని చోరీల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా తాళం వేసిన ఇంట్లోకి చొర‌బ‌డి బీరువాల‌ను ధ్వంసం చేసి విలువైన ప‌త్రాలు, దేవుని హుండిని ఎత్తుకెళ్లిపోయారు. ఆదివారం ఉద‌యం ప‌ట్ట‌ణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో ఈ సంఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. స్థానికులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. ప‌ట్ట‌ణంలోని శీవాజీ చౌక్ సాయిమేధా స్కూల్ వెనుక భాగంలో మోహ‌న్ రెడ్డి అనే వ్య‌క్తి నివాసం ఉంటున్నారు. ఇటీవ‌లే ఆయ‌న త‌న ఇంటికి తాళం వేసి హైద‌రాబాద్ వెళ్లిపోయారు. ఆదివారం ఉద‌యం ఇళ్లు తెరిచి ఉండ‌డం.. ఇంట్లో వ‌స్తువులు చింద‌ర వంద‌రగా ప‌డి ఉండడాన్ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

మోహ‌న్ రెడ్డి ఇంట్లో ఉన్న మూడు బీరువాలు ధ్వంస‌మ‌య్యాయి. అయితే అందులో విలువైన ప‌త్రాల‌ను మాయ‌మైన‌ట్లు తెలిసింది. దీంతో పాటు దేవుని గ‌దిలో ఉన్న హుండిలో ఉన్న న‌గ‌దును కూడ గుర్తుతెలియ‌ని దొంగ‌లు ఎత్తుకెళ్లిన‌ట్లు తెలిసింది. మోహ‌న్ రెడ్డి వ‌చ్చిన త‌రువాతే పూర్తి వివ‌రాలు తెలుస్తాయ‌ని స్థానికులు వాపోయారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement