Thursday, April 18, 2024

హిమ్మ‌త్ లేదు.. గెల్లుకు సొంతూళ్లో నిరాశే..

క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొన‌సాగుతోంది. ప్ర‌తి రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధిక్య‌త క‌న‌బ‌ర్చుతున్నారు. ఎనిమిదో రౌండ్ లోనూ ఆయ‌న స్వ‌ల్ప‌ ఆధిక్యం సాధించారు.

అయితే టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ సొంతూరు హిమ్మ‌త్ న‌గ‌ర్‌లో ఓట‌ర్లను ఆక‌ట్టుకోలేక‌పోయారు. బూత్ నెంబ‌ర్ 100 లోని హిమ్మ‌త్ న‌గ‌ర్‌లో ఈటల రాజేంద‌ర్‌కు 191 ఓట్ల ఆధిక్యం రావ‌డ‌మే దీనికి కార‌ణంగా చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement