Wednesday, April 24, 2024

ఎయిర్ పోర్టులో తప్పించుకున్న మహిళ చింతల్ లో ప్రత్యక్షం

కుత్బుల్లాపూర్, (ప్రభ న్యూస్): విదేశాల నుండి వ‌చ్చిన‌ కోవిడ్ పాజిటీవ్ మహిళ కుత్బుల్లాపూర్ లోని చింతల్ లో ప్రత్యక్ష మైయింది. గురువారం బ్రిటన్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మహిళ (36) కు ఎయిర్ పోర్టుకు రాగానే కోవిడ్ టెస్టులు నిర్వహించారు.. కాగా సంబంధిత మహిళకు కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. దీంతో అధికారులు ఆమెను గచ్చిబౌలిలోని టిమ్స్ కు తరలించి ఐసోలేషన్ లో పెట్టేందుకు ఏర్పాటు చేయగా.. ఆమె అధికారుల కళ్లుగప్పి చింతల్ రీడ్జ్ టవర్ లో ఉంటున్న వారి తల్లిదండ్రుల వద్దకు చేరింది.

మహిళ తప్పించుకుందన్న సమాచారం మేరకు ఎయిర్ పోర్ట్ అధికారులు పాస్ పోర్ట్ ఆధారంగా మహిళ చిరునామా తీసుకుని జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు శుక్రవారం ఉదయం రిడ్జ్ టవర్ కు చేరుకుని తనిఖీ చేయగా సదరు మహిళ ప్రత్యక్ష మైంది.. స్థానిక అసోసియేషన్ కు సమాచారం ఇచ్చిన పోలీసు వారి సహకారంతో గచ్చిబౌలి టిమ్స్ కు తరలించారు.. కాగా రిడ్జ్ టవర్స్ వాసులు ఆందోళనకు లోనవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement