Tuesday, April 23, 2024

రామప్ప శిల్ప కళా సౌందర్యం అద్భుతం.. కేంద్ర ప్రభుత్వ అధికారి నితిన్ వర్మ

వెంకటాపూర్ (ప్రభ న్యూస్): రామ‌ప్ప ఆల‌యంలోని శిల్ప క‌ళా సౌంద‌ర్యం అద్భుతంగా ఉంద‌ని.. ఇట్లాంటి క‌ళా చాతుర్యం మ‌రెక్క‌డా చూడ‌లేద‌న్నారు కేంద్ర ప్ర‌భుత్వ అధికారి నితిన్ వ‌ర్మ‌. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని శుక్రవారం ఆయ‌న సందర్శించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం టూరిజం గైడ్ విజయ్ శిల్పకళ సౌందర్యం గురించి వారికి వివరించారు. శిల్ప కళా సౌందర్యాన్ని చూసి వారు అబ్బుర పోయారు. ఆ త‌ర్వాత రామప్ప సరస్సులో బోటింగ్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) స్టేట్ కోఆర్డినేటర్ లు శ్రావ్య, శ్యామ్ కుమార్, బాల చంద్ర, డిఆర్డిఓ వెంకటనారాయణ, అడిషనల్ డిఆర్డిఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement