Saturday, April 20, 2024

అవార్డు దక్కడంలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయం.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి, (ప్రభ న్యూస్) : దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వశక్తి కరన్ అవార్డు దక్కడంలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలం దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వశక్తి కరన్ పురాస్కారం అవార్డు పొందిన సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులు, కార్యాలయ ఉద్యోగులను ఆయ‌న ఘనంగా సన్మానించారు.

అవార్డు దక్కడంలో జర్నలిస్టుల పాత్రను గుర్తిస్తూ మండల జర్నలిస్టులను పలువురిని సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎంపీపీ స్రవంతి-శ్రీనివాస్, జడ్పిటిసి రాంమూర్తి, పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ప్రదాన కార్యదర్శి నారాయదాస్ అశోక్, ఉపాద్యక్షుడు కుమ్మరి ముకేష్ కు శాలువాకప్పి సత్కరించారు. జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఈ సత్కారం పట్ల పెద్దపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement