Saturday, April 20, 2024

Telangana | భారత రాష్ట్రపతి ముర్ము పర్యటన కొనసాగింది ఇలా…

వెంకటాపూర్ (ప్రభ న్యూస్): ములుగు జిల్లా రామప్ప పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు హెలిప్యాడ్ కి చేరుకున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య (ఐఏఎస్), ఐటిడిఏ పీవో అంకిత్ (ఐఏఎస్), ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ (ఐపీఎస్) స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులున్నారు. అనంతరం రోడ్డు మార్గం గుండా ప్రత్యేక వాహనంలో రామప్ప ఆలయానికి చేరుకున్నారు. పూజారులు రామలింగేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement