Thursday, April 25, 2024

రేపు ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని అందుకోనున్న ఎమ్మెల్సీ క‌విత

ఎమ్మెల్సీ క‌విత‌ రేపు ఎమ్మెల్సీ గా గెలుపొందిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని అందుకోనున్నారు. ముందుగా ఉదయం 6 గంటలకు దిల్ సుఖ్‌ నగర్ అష్ట లక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మ‌ధ్యాహ్నం 1 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటారు.

అనంత‌రం 3 గంటలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్సీగా ఎన్నికైన గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామిను దర్శించుకుంటారు ఎమ్మెల్సీ క‌విత‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement