Wednesday, April 24, 2024

నేడు న‌ల్గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న మంత్రులు


తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లు ఇవాళ‌ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఉదయం 10:45 నిమిషాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ హాస్టల్ ప్రారంభం, ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ హబ్ కార్యాలయానికి శంకుస్థాపన చేయ‌నున్నారు. అలాగే మధ్యాహ్నం 12:30 గంటలకు బీట్ మార్కెట్లో వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ కు శంకుస్థాపన, మధ్యాహ్నం 1 గంటకు నల్గొండ జైలుఖాన వద్ద రైతుబజార్, బస్తీ దవాఖానలకు స్థల పరిశీలన, మధ్యాహ్నం 2 గంటలకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ జిల్లాకు సంబంధించిన మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement