Friday, April 26, 2024

లైట్ రైల్ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది.. ప్లాన్ అంతా రెడీ చేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో కొత్త ప్రాజెక్టు లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఆర్‌టీఎస్‌)ను చేపట్టేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భాగ్యనగరంలో మల్టి మోడల్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌), హైదరాబాద్‌ మెట్రోరైల్‌ (హెచ్‌ఎంఆర్‌) ఉన్నాయి. వీటికి తోడు లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని సర్కార్‌ భావిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని రాష్ట్ర అధికార వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌లో గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకాపేట ప్రాంతాల్లో చాలా వరకు బహుళజాతి కంపెనీలు ఉన్నాయి. మరిన్ని కంపెనీలు ఆ ఏరియాలో ఏర్పాటు కాబోతున్నాయి. ఇక్కడ లక్షలాది మంది ఉద్యోగులు నిత్యం పని చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో వీరంతా కార్యాలయాలకు వచ్చి వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మల్టి మోడల్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే అతిపెద్ద హౌజింగ్‌ బోర్డుల్లో ఒకటిగా ఉన్న కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు నుంచి కోకాపేట వరకు లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ప్రాజెక్టు చేపడితే ఎలా ఉంటుందని హైదరాబాద్‌ యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు ఆథారిటీ (హెచ్‌యూఎంటీఏ)లు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement