Tuesday, April 23, 2024

ఇద్దరు పిల్లల గొంతుకోసి చంపేసి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి.. భార్యభర్తల గొడవలే కారణమా?

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ సమీపంలో దారుణం జ‌రిగింది. కన్న తండ్రి చేతిలో చిన్నారి కొడుకు, కూతురు దారుణ హత్యకు గురయ్యారు. కుడికిల్ల గ్రామానికి చెందిన ఓంకార్ తన ఇద్దరు పిల్లల గొంతులు కోసి చంపేశాడు. మృతుల్లో చందన (3) విశ్వనాథ్(1)గా గుర్తించారు. అయితే తాను కూడా గొంతు గోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓంకార్. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement