Wednesday, April 24, 2024

తండ్రి కారు రివర్స్ తీస్తుంటే.. ఘోరం

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ మన్సూరాబాద్ కాస్మోపాలిటన్ కాలనీలో విషాదం జ‌రిగింది. ఓ వాచ్‌మెన్‌ కారును రివర్స్ చేస్తుంటే కారు చక్రాలకింద పడి అతని కొడుకు చ‌నిపోయాడు. జహీరాబాద్‎కు చెందిన అంగిర్ల లక్ష్మణ్, రాణి దంపతులు సిటీకి వచ్చి మన్సూరాబాద్‎లోని కాస్మోపాలిటన్ కాలనీలోని ఓ అపార్ట్‎​మెంట్​లో వాచ్‎మెన్‎గా చేరారు. వీరికి కుమార్తె భవాని, కొడుకు సాత్విక్ ఉన్నారు.

ఆదివారం ఉదయం లక్ష్మణ్​ అపార్ట్​మెంట్​లో కారును రివర్స్ తీస్తుండగా అక్కడే ఆడుకుంటున్న అతని కొడుకు సాత్విక్ కారు వద్దకు పరిగెత్తుకొచ్చాడు. గమనించని లక్ష్మణ్ కారును అలాగే వెనక్కి వెళ్ల‌నీయ‌డంతో సాత్విక్ మీదుగా కారు వెళ్లింది. దాంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. కామినేని హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చ‌నిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement