Thursday, April 25, 2024

నేడు హైకోర్టులో ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈకేసులో మంగళవారం వాడివేడిగా వాదనలు కొనసాగాయి. కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి తీర్పుపై ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం, సిట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. అయితే ఇక ప్రభుత్వం తరపున ఇవాళ దుష్యంత్ దవే పూర్తి వాదనలను వినిపించాలని మధ్యాహ్నం ఒంటి గంటకు కోర్టు కేసును వాయిదా వేసింది. ఇక సీబీఐ ఎలాంటి వాదనలు వినిపిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement