Thursday, March 28, 2024

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితులకు బెయిల్‌ తిరస్కరణ

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్ ను హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టు తిరస్కరించింది. నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఈరోజు కోర్టులో విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. దర్యాప్తు సందర్భంలో బెయిల్‌ ఇస్తే ఆటంకం ఎదురవుతుందన్న న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు.. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

ప్రస్తుతం నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీలు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. నందకుమార్‌పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. డెక్కన్ కిచెన్ యాజమాన్యంతో పాటు నందకుమార్‌ వద్ద స్థలం లీజుకు తీసున్న మరో వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement