Thursday, March 28, 2024

మూసీ ఒడ్డున 12 ఏళ్ల బాలుడి మృతదేహం.. కుక్క‌లు క‌రిచి చంపేశాయా, ఎవ‌రైనా హతమార్చారా?

కార్వాన్ (ప్రభన్యూస్): హైద‌రాబాద్‌లోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జ‌రిగింది. మూసీ పరివాహక ప్రాంతంలోని నది ఒడ్డున 12 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని ఇవ్వాల పోలీసులు స్వాదీనం చేసుకున్న‌ట్టు ఇన్‌స్పెక్ట‌ర్‌ అశోక్ కుమార్ తెలిపారు. బాలుడు రోజు మాదిరిగా ఆడుకోవడానికి వెళ్లాడ‌ని, మధ్యాహ్నం సమయంలో కుక్కలు దాడిచేసి బాలుడిని కొరికి చంపిన‌ట్టు తెలుస్తోంద‌న్నారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారన్నారు.

కాగా, చ‌నిపోయిన‌ బాలుడు మహమ్మద్ సుఫియాన్ (12)గా గుర్తించారు. అత‌ని తండ్రి మహ్మద్ సయ్యద్‌కు స‌మాచారం అందించారు. ఇత‌ను కుల్సుంపురా పరిధిలోని పటేల్ హోటల్ ల్లో టీ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్ చేరుకుని ఆధారాలు సేక‌రించింది. బాలుడి మృతి అనుమానాస్ప‌దంగా ఉండ‌డంతో పోలీసులు హత్యా కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement