Thursday, April 25, 2024

సీఎం కేసీఆర్‌కు రైతుల ప్రయోజనమే ముఖ్యం.. మోటార్లకు మీటర్లు పెట్టం: ప్రశాంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రైతుల ప్రయోజనమే ముఖ్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీజేపీకి భయపడి పక్క రాష్ట్రం ఏపీలో మోటార్లకు మీటర్లు పెడుతున్నారని, తెలంగాణలో మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని కేంద్రానికి సీఎం తెగేసి చెప్పారన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

సోషల్‌ మీడియాలో అబద్ధపు ప్రచారాలను ధీటుగా తిప్పికోట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి వేముల సమక్షంలో నిజామాబాద్‌ జిల్లా నియోజకవర్గంలోని బీజేపీ పార్టీకి చెందిన నేతలు, యువకులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement