Saturday, April 20, 2024

నేటి నుంచి టెన్త్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 23 నుంచి జూన్‌ 1 వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరగ నున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు చేస్తున్నా రు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరగనుంది. నేటి నుండి వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కార్యాలయంలోనూ హాల్‌ టికెట్లు విద్యార్థులు పొందవచ్చని పేర్కొన్నారు. 5,09,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement