Thursday, April 25, 2024

Breaking: గుడిసెల కూల్చివేతకు పోలీసుల యత్నం

వరంగల్ మట్టెవాడ శివారు నిమ్మాయ చెరువు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఇటీవల పేదలు సిపిఐ ఆద్వర్యంలో వేసుకున్న గుడిసెలను పోలీసులు శుక్రవారం కూల్చివేతకు యత్నించారు. స్థానిక పోలీసులు జేసిబితో వచ్చి గుడిసెలను కూల్చివేయడంతో పాటు పలు గుడిసెలను దగ్దం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో గుడిసెలు వేసుకున్న పేదలు, సిపిఐ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. పోలీసులను, జేసిబిని చుట్టుముట్టి అక్కడి నుండి తరిమి కొట్టారు. సిపిఐ జిందాబాద్ అంటూ నినాదాలు చేసారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. విషయం తెలుసుకున్న సిపిఐ నాయకులు హుటాహుటిన నిమ్మాయ చెరువు ప్రాంతానికి చేరుకుని కూల్చివేసిన గుడిసెలను పరిశీలించి పేదలకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల గుడిసెలను కూల్చివేస్తే సహించబోమన్నారు. ఇండ్ల స్థలాలు సాదించుకునే వరకు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతామన్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల అండదండలతో కవ్వింపు చర్యలకు పాల్పడితే పేదలు ప్రతిఘటిస్తారని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement