Friday, March 29, 2024

దేవాలయాల్లో దర్శనాల రద్దు

తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉండడంతో అన్ని  దేవాలయాల్లో దర్శనాల రద్దు చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇవాళ్టి నుంచి లాక్‌ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దర్శనాలను సైతం రద్దు చేస్తూ దేవాదాయ శాఖ ప్రకటించింది. దాదాద్రి, కొమురవెల్లి సహా పలు ఆలయాల్లో భక్తుల దర్శనాలు రద్దు చేశారు. ఈ నెల 21 వరకు దర్శనాలు నిలిపివేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నిత్య కైంకర్యాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement