హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఏడాదిలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రతి ఏటా ఆర్థిక ఏడాది ఏప్రిల్ 1తో మొదలై మార్చి 31తో ముగుస్తుండగా, ఆబ్కారీ ఏడాది అక్టోబర్ 1నుంచి సెప్టెంబర్ 31వరకు కొనసాగిస్తు న్నారు. ఈ విధానంతో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు రూ.30,943 కోట్ల మద్యం విక్రయాలు గరిష్టంగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు 30శాతం వృద్ధిరేటును సంతరించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపేణా నిధుల సమీకరణలో ఆబ్కారీ శాఖను కీలకంగా పరిగణలోకి తీసుకుంది. ఈ నెలలో దసరా పండుగ, హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి మద్యం మరింత కలిసి రానున్నది. అయితే సంప్రదాయంగా మద్యం విక్రయాలకు ప్రతియేటా అక్టోబర్ కలిసి వస్తోంది. ఏటేటా అక్టోబర్ నెలలో విక్రయాలు సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా మద్యం విక్రయాలతో దసరా పండుగకు భారీగా ఆదాయం రాబట్టుకోవాలని ఆబ్కారీ శాఖ క్షేత్రస్థాయికి ఆదేశాలు జారీ చేసింది. వరుసగా రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా కోల్పోయిన ఆదాయాన్ని సమీకరించుకునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. దసరా పండుగ నేపథ్యంలో విక్రయాల పెంపునకు టార్గెట్లు విధించింది. గతేడాది దసరా పండుగ వచ్చిన అక్టోబర్లో రూ.2,623 కోట్ల మద్యం విక్రయించగా, ఈ ఏడాది రూ.5 వేల కోట్ల అంచనాను నిర్ధేశించుకున్నారు. గతేడాది అక్టోబర్లో మద్యం విక్రయాలు 31.68.346 కేసులు, బీర్లు 26.93.153 పెట్టెలు విక్రయమయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 1నుంచి ఇప్పటి వరకు రూ.1,138 కోట్ల మద్యం విక్రయమైంది. దసరా పండుగ 15న ఉండటంతో ఆ తర్వాతి రోజు 16నాటికి రూ.5 వేల కోట్ల లక్ష్యం నిర్ధేశించుకున్నారు. గతేడాది అక్టోబర్ 1నుంచి ఇప్పటివరకు రూ.30,943 కోట్ల మద్యం, బీర్ విక్రయాలయ్యాయి.కరో నా కారణంగా మద్యం విక్ర యాలు పుంజుకోగా, బీర్ విక్ర యాల్లో కొంత ప్రతికూల ప్రభా వం నమోదైంది. ఇదూ సమ యంలో 3,80,05,673 పెట్టెల మద్యం, 3,23,78,518 పెట్టెల బీర్లు అమ్ముడయ్యాయి.
ఈ నెలలో ఇప్పటి వరకు రూ.1,138 కోట్ల మద్యం విక్ర యమైంది. ఇందులో హైద రా బాద్ రూ.157 కోట్లతో మొదటి స్థానంలో, రంగారెడ్డి రూ.154 కోట్లతో రెండో స్థానంలో, నల్గొం డ రూ.103 కోట్లతో తృతీయ స్థానంలో నిల్చాయి. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే రాష్ట్రంలోని 2216 మద్యం దుకాణాలు, 1018 బార్లు, ఇతర పబ్బులతో కలుపుకుని రూ.15 వేల కోట్ల మద్యం అమ్ముడైంది. ఇందులో రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్, వరం గల్, మెదక్ జిల్లాలు ముందం జలో ఉన్నాయి. గతేడాదికంటే 27శాతం మద్యం, బీర్ విక్రయాలు ఎక్కువగా నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్లో మద్యం దుకాణాలు కరోనా లాక్డౌన్లో బందయ్యాయి. మే నెలలో ఒక్కసారిగా తెరవడంతో విపరీతంగా మద్యం విక్రయాలు జరిగాయి. ఆ నెలలో కరోనా సెస్ పేరుతో 20శాతం వరకు ధరలు పెంచారు. గతంలో బీర్ల విక్రయం ఎక్కువగా ఉండగా కరోనా కారణంగా పరిస్థితి తలకిందులైంది. ఈ జులైలో రూ.90గా ఉన్న బీర్ ధరను రూ.150కి పెంచారు.
డిపోల వారీగా…
డిపో అమ్మకాలు..
కోట్లలో
ఆదిలాబాద్ 1056
హన్మకొండ-1 1454
హన్మకొండ-2 1661
హైదరాబాద్-1 1309
హైదరాబాద్-2 2151
కరీంనగర్ 1864
ఖమ్మం 2272
మహబూబ్నగర్ 1513
మంచిర్యాల్ 1209
మెదక్ 1164
మేడ్చేల్-1 1013
మేడ్చేల్-2 2023
నల్గొండ 2661
నిజామాబాద్ 1534
రంగారెడ్డి-1 2026
రంగారెడ్డి-2 2098
సిద్దిపేట్ 1391
వనపర్తి 1175
యాదాద్రి 1359