Thursday, April 25, 2024

లాయర్ దంపతుల కేసు.. చార్జ్ షీట్ ఫైల్ చేశారా?

న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసుపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తయిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. చార్జ్ షీట్ ఫైల్ చేశారా? అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. గత నెల 19న విచారణ పూర్తి చేసి మంథనిలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు చార్జ్ షీట్ ధాఖలు చేశానని కోర్టుకు ఏజీ తెలిపారు. చార్జ్ షీట్ మీద విచారణ ఈ నెల 10 నుంచి మంథని కోర్టులో జరుగుతుందని ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో సుమోటో కేసును హైకోర్టు ముగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement